Friday, 11 September 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / జాతీయ వార్తలు

చక్కెర ధరల పెరుగుదలకు ఇథనాల్ కారణం కాదు..!

26 Aug 2026
09:23 PM
46

* అక్టోబర్లో కొత్త క్రషింగ్ సీజన్ వరకు సరిపడా నిల్వలు ..
* ఇథనాల్ కోసం చక్కెర మళ్లింపు 12 నుంచి 9 శాతానికి తగ్గిందని కేంద్రం వెల్లడి ...

Delhi  :
దేశంలో ప్రస్తుతం చక్కెర కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అక్టోబర్లో కొత్త క్రషింగ్ సీజన్ ప్రారంభమయ్యే వరకు దేశీయ అవసరాలను తీర్చేందుకు తగినంత చక్కెర నిల్వలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది. చక్కెర ధరల్లో ఇటీవల చోటుచేసుకుంటున్న పెరుగుదలకు ఇథనాల్ ఉత్పత్తి కార్యక్రమాన్ని కారణంగా చూపడం సరికాదని ప్రభుత్వం పేర్కొంది. ఇథనాల్ తయారీ కోసం చక్కెరను మళ్లించే పరిమాణం గతంతో పోలిస్తే తగ్గిందని వివరించింది. దేశీయ మార్కెట్లో చక్కెర సరఫరాకు ఎలాంటి కొరత ఏర్పడకుండా కేంద్రం పరిస్థితిని పర్యవేక్షిస్తోందని తెలిపింది.

చక్కెర పరిశ్రమకు సంబందించి ఇథనాల్ ఉత్పత్తి అంశం గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారింది. చెరకు నుంచి చక్కెర తయారీతో పాటు ఇథనాల్ ఉత్పత్తికి కూడా ముడి పదార్థాన్ని వినియోగిస్తుండటంతో దేశీయ చక్కెర లభ్యతపై ప్రభావం పడుతుందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి కొరత లేదని కేంద్రం స్పష్టం చేసింది. దేశంలో అంమబాటులో ఉన్న నిల్వలు, చక్కెర వినియోగం, కొత్త సీజన్లో ప్రారంభం కానున్న చెరకు క్రషింగ్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ప్రభుత్వం ఈ భరోసా ఇచ్చింది. వినియోగదారుల అవసరాలకు సరిపడా చక్కెరను దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉంచేలా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది.

ఇథనాల్ ఉత్పత్తికి చక్కెర మళ్లింపు తగ్గిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు కూడా సూచిస్తున్నాయి. 2022-23లో ఇథనాల్ తయారీ కోసం మళ్లించిన చక్కెర వాటా సుమారు 12 శాతంగా ఉండగా, 2025-26 నాటికి అది 9 శాతానికి తగ్గిందని ప్రభుత్వం తెలిపింది. అంటే గతంతో పోలిస్తే చక్కర నుంచి ఇథనాల్ ఉత్పత్తికి వెళ్లే మళ్లింపు తగ్గినట్టుగా కేంద్రం వివరించింది. ఈ నేపథ్యంలో చక్కెర ధరలు పెరగడానికి ఇథనాల్ కార్యక్రమమే ప్రధాన కారణమని చెప్పడం వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా లేదని ప్రభుత్వం పేర్కొంది. చక్కెర రంగానికి సంబంధించిన విధాన నిర్ణయాలు తీసుకునేటప్పుడు దేశీయ వినియోగదారుల అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నామని స్పష్టం చేసింది.

దేశంలో ఇథనాల్ ఉత్పత్తి వ్యవస్థలో కూడా మార్పులు చోటుచేసుకుంటున్నాయని కేంద్రం వివరించింది. ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న ఇథనాల్లో దాదాపు మూడొంతుల వాటా ధాన్యాల నుంచే వస్తోందని తెలిపింది. ముఖ్యంగా మొక్కజొన్న ఇథనాల్ ఉత్పత్తికి కీలకమైన ముడి పదార్థంగా మారుతోందని పేర్కొంది. దీని వల్ల చక్కెర రంగం నుంచి ఇథనాల్ తయారీపై ఉండే ఆధారపడటం కొంత మేర తగ్గుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ధాన్యాల ఆధారిత ఇథనాల్ ఉత్పత్తి పెరగడం వల్ల చక్కెరను ఇథనాల్ తయారీ కోసం మళ్లించాల్సిన అవసరం తగ్గుతుందని కేంద్రం అభిప్రాయపడుతోంది.

ఇథనాల్ మిశ్రమ కార్యక్రమం నేపథ్యంలో దేశంలో ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు గత కొన్నేళ్లుగా చర్యలు కొనసాగుతున్నాయి. పెట్రోల్లో ఇథనాల్ కలపడం ద్వారా దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడం, దేశీయంగా ఉత్పత్తి అయ్యే వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు మార్కెట్ కల్పించడం వంటి లక్ష్యాలతో ఈ కార్యక్రమానికి ప్రాధాన్యం లభించింది. చెరకు, మొలాసిస్తో తో పాటు ధాన్యాల నుంచి కూడా ఇథనాల్ తయారు చేస్తున్నారు. ప్రస్తుతం మొత్తం ఇథనాల్ ఉత్పత్తిలో ధాన్యాల వాటా గణనీయంగా పెరిగినట్లు కేంద్రం వెల్లడించిన తాజా వివరాలు సూచిస్తున్నాయి.

చక్కెర ధరల విషయంలో వినియోగదారులపై అదనపు భారం పడకుండా సరఫరా పరిస్థితిని పర్యవేక్షించడం కేంద్రానికి కీలకంగా మారింది. పండుగలు, వివాహాలు, ఆహార పరిశ్రమ అవసరాలు వంటి కారణాలతో కొన్ని కాలాల్లో చక్కెరకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో సరఫరా తగ్గితే ధరలపై ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే అక్టోబర్లో కొత్త క్రషింగ్ సీజన్ ప్రారంభమయ్యే వరకు ప్రస్తుత నిల్వలు దేశీయ డిమాండ్ను తీర్చేందుకు సరిపోతాయని కేంద్రం స్పష్టం చేసింది. చక్కెర పరిశ్రమలో ఉత్పత్తి, విల్వలు, వినియోగం వంటి అంశాలపై పరిస్థితిని బట్టి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

చెరకు ఆధారిత ఇథనాల్ ఉత్పత్తి తగ్గుతున్న నేపథ్యంలో రైతులు, చక్కర మిల్లులు, ఇథనాల్ తయార్ సంస్థలపై కూడా ఈ మార్పుల ప్రభావం ఉండే అవకాశం ఉంది. చక్కెరను వేరుగా విక్రయించడంతో పాటు ఇథనాల్ తయారీకి మళ్లించడం ద్వారా చక్కెర మిల్లులకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గం లభిస్తుంది. అదే సమయంలో దేశీయ మార్కెట్లో చక్కెర లభ్యత తగ్గకుండా ప్రభుత్వం సమతుల్యత పాటించాల్సి ఉంటుంది. అందుకే ఇథనాల్ ఉత్పత్తికి మళ్లించే చక్కెర పరిమాణంపై విధానపరమైన నియంత్రణలు, మార్గదర్శకాలు కీలకంగా మారుతున్నాయి. తాజా గణాంకాల్లో చక్కెర మళ్లింపు 12 శాతం నుంచి 9 శాతానికి తగ్గిందని కేంద్రం స్పష్టం చేసింది. 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!