Friday, 11 September 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

డీఎస్సీ అక్రమాలపై రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో కదంతొక్కిన విద్యార్థులు, నిరుద్యోగులు ... !

28 Jul 2026
03:50 PM
1,025

* యువజన...విద్యార్ధి విభాగం ఆధ్వర్యంలో...ర్యాలీలు, ధర్నాలతో హోరెత్తిన నిరసనలు
* లోకేశ్‌ రాజీనామా చేయాలి.. సీబీఐ విచారణ జరిపించాలి
* జిల్లాల్లో పోటెత్తిన విద్యార్థులు, నిరుద్యోగ యువత ...
* పలుచోట్ల పోలీసుల అడ్డంకులు.. అయినా కొనసాగిన ఆందోళనలు

Astranews desk  : 
ఎపిలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ-2025 నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా కదంతొక్కింది. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి  వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి  పిలుపు మేరకు మంగళవారం పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో జిల్లాల్లో భారీ ర్యాలీలు, ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేపట్టారు. డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగ యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణతో పాటు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వసతి దీవెన బకాయిల విడుదల, నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పలుచోట్ల పోలీసులు ర్యాలీలను అడ్డుకునేందుకు ప్రయత్నించినా పార్టీ శ్రేణులు నిరసనలు కొనసాగించాయి.

కడపలో  : 
డీ
ఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న అవకతవకలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కడపలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ కోటిరెడ్డి సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, సెవెన్ రోడ్స్ సర్కిల్, వైఎస్సార్ సర్కిల్ మీదుగా గాంధీ సర్కిల్ సమీపంలోని గాంధీ విగ్రహం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథ్ రెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధ, ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి, రామసుబ్బారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ బాషా, సీఈసీ సభ్యులు కే. సురేష్ బాబు, మాజీ ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున రెడ్డి, కమలాపురం ఇన్‌చార్జిగా నరేన్ రామాంజుల రెడ్డి, మాజీ మేయర్ పాక సురేష్,తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథరెడ్డి మాట్లాడుతూ  ఎపిలో కూటమి ప్రభుత్వం భర్తీ చేసిన మెగా డిఎస్సీ అదొక దగా డిఎస్సీ అని విమర్శించారు. కష్టపడిన వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా ...ఇష్టమెచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చారని, ఇంత దారుణం ఏ రాష్ఱ్టంలో జరగలేదని, ఎపీలో మాత్రమే జరిగిందన్నారు. ఈ డిఎస్సీలో చటు చేసుకున్న అక్రమాలపై తప్పక సిబిఐ విచారణ జరిపించాల్సిందేనని డిమాండ్ చేశారు. డిఎస్సీ అక్రమాలకు సంబంధించి అనేక సాక్ష్యాలు చూపి ప్రశ్నిస్తున్నా... దొన్నపోతు మీద వర్షం పడినట్లుగా కూటమి ప్రభుత్వం  పలకడం లేదన్నారు. ఈ డిఎస్సీని రద్దు చేసి కొత్త డిఎస్సీని మళ్లీ నిర్వహించాలని,  తక్షణం మంత్రి నారా లోకేష్ రాజీనామా చెయ్యాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అరాచకాలన్ని ప్రజలు చూస్తున్నారని, తప్పక నష్టపోయిన విద్యార్ధులు కూటమి ప్రభుత్వానికి  సినిమా చూపిస్తారని వార్నింగ్ ఇచ్చారు. 

 

 

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!