Tuesday, 28 July 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / జాతీయ వార్తలు

"మీ సమయాన్ని వృథా చేసుకోకండి, మా సమయాన్ని కూడా వృథా చేయకండి"... !

22 Jul 2026
02:39 PM
163

* సీజేపీ నిరసనకారులపై దాడుల పిటిషన్‌‌ సీజేఐ వ్యాఖ్య...
* సీజేపీ నిరసనకారులపై దాడుల పిటిషన్‌‌ను తక్షణమే విచారించేందుకు సీజేఐ నిరాకరణ ...
* సీజేఐ వ్యాఖ్యలతోనే  ఆవిర్భావం సీజేపీ ...
 
Delhi : 

నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ పిలుపు మేరకు కొనసాగుతున్న నిరసనల్లో భాగంగా సోమవారం  పోలీసులు వారిపై దాడులు చేసిన ఘటనపై అత్యవసరంగా విచారించాలంటూ దాఖలైన పిటిషన్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్  కీలక వ్యాఖ్యలు చేశారు.

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనకారులపై దిల్లీ పోలీసులు చర్యలపై దాఖలైన పిటిషన్‌ అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు బుధవారం నిరాకరిస్తూ..."మీ సమయాన్ని వృథా చేసుకోకండి, మా సమయాన్ని కూడా వృథా చేయకండి" అని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్య కాంత్, జస్టిస్ జొయమల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనల ధర్మాసనం ముందు హాజరైన ఆ న్యాయవాది.. ఈ విషయాన్ని మరుసటి రోజు విచారణ జాబితాలో చేర్చాలని కోరినట్టు ‘బార్ అండ్ బెండ్’ తెలిపింది.

Article Image
‘నిరసన  వీడియోలు చూసేందుకు అసక్తి చూపని సిజేఐ  : 
విద్యార్థులు జంతర్ మంతర్ వద్ద చేసిన నిరసనల్లో పోలీసులు దారుణంగా కొట్టారని, చాలా కఠినంగా వ్యవహరించారని అందుకు సంబంధించిన వీడియోలు చూడాలని న్యాయవాది కోరగా...దీనిపై స్పందించిన భారత ప్రధాన న్యాయమూర్తి "దయచేసి మా సమయాన్ని వృథా చేయకండి, మీ సమయాన్ని కూడా వృథా చేసుకోకండి. మా సమయం కంటే మీ సమయం చాలా విలువైనది" అని అన్నారు. నీట్ పరీక్షను నిష్పక్షపాతంగా నిర్వహించడం, పదేపదే పేపర్ లీక్‌లు జరుగుతున్నందున నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)ని రద్దు చేయడంతో పాటు కొన్ని ముఖ్యమైన డిమాండ్లు నెరవేర్చాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారని ఆ న్యాయవాది చెప్పారు.  కోర్టు తదుపరి కేసు విచారణ ప్రారంభించపోతుండగా నిరసన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల చర్యలకు సంబంధించిన వీడియోలను తాను చూపించగలనని న్యాయవాది మరోసారి చెప్పారు. "మాకు ఆ వీడియోపై ఆసక్తి లేదు. వాటిని చూసేందుకు మాకు సమయం లేదు" అని సీజేఐ సూర్యకాంత్ తేల్చిచెప్పారు. 

Article Image
సీజేఐ వ్యాఖ్యలతోనే సీజేపీ ఆవిర్భావం ...  : 
కాక్రోచ్ జనతా పార్టీ మొదట వ్యంగ్యాత్మక ఆన్‌లైన్ ప్రచార కార్యక్రమంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. మే 15న ఒక కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ కొన్న వ్యాఖ్యలు చేశారు. "వ్యవస్థపై దాడి చేసే పరాన్నజీవులు సమాజంలో ఇప్పటికే ఉన్నాయి. మీరు కూడా వారితో చేరాలనుకుంటున్నారా? కొంతమంది యువకులు ఉద్యోగం దొరకక, తమ వృత్తిలో స్థానం సంపాదించుకోలేక, బొద్దింకల్లా అన్నిచోట్లా వ్యాపిస్తున్నారు" అని భారత ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యలపై విస్తృతస్థాయిలో విమర్శలొచ్చాయి. ఆ విమర్శల తర్వాత తన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించారని పేర్కొంటూ సీజేఐ సూర్యకాంత్ ఒక వివరణ జారీ చేశారు. కానీ సీజేపీ ఆవిర్బవానికి ఈ వ్యాఖ్యలే కారణమయ్యాయి. దీంతో ఇప్పుడు కేసు విచారించేందుకు సీజేఐ అసక్తి చూపకపోవడానికి కారణం కూడా ఇదే అయి ఉంటుందని ప్రచారం సాగుతుంది. 

పోలీసులు లాఠీచార్జ్ ని తప్పుపట్టిన అమ్నెస్టీ ఇంటర్నేషనల్ : 
కానీ సోమవారం జరిగిన నిరసన ప్రదర్శన సందర్భంగా, సీజేపీ నిరసనకారులు,విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేసి, బాష్పవాయువు ప్రయోగించారు. దీన్ని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు విమర్శించారు. భారత్‌లో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును అణచివేస్తున్నారని మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొంది.

 

 

 

 

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!