Sunday, 10 May 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / అంతర్జాతీయ వార్తలు

హార్మూజ్ తెరవండ్రా "బా.... "... ! ఇరాన్ పై బూతులతో రెచ్చిపోయిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ .. లెక్క చెయ్యని ఇరాన్ ...దాడులపైనే ప్రధాన ఫోకస్ ...

05 Apr 2026
09:44 PM
35

ఇంటర్నేషనల్ డెస్ట్  : 

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు  ఇఫ్పుడిప్పట్లో తగ్గలా లేవు. ఇరాన్- అమెరికా మధ్య మాటల యుద్దం జరుగుతుండటంతో యుద్ధం తీవ్రత రోజురోజుకూ ముదిరిపాకాన పడుతొంది. ఓ వైపు ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దళాలు విరుచుకుపడుతుండగా.. అదే సమయంలో ఇరాన్ ఆ దేశాలపై ప్రతీకార దాడులు చేస్తోంది. ఇక ఇరాన్ కు ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చాలా సార్లు వార్నింగ్ ఇచ్చారు. హార్మూజ్ జలసంధిని తెరవాలని.. సంధి చర్చలకు సహకరించాలని అల్టిమేటం ఇచ్చారు. అయినా ఇరాన్.. ట్రంప్ మాటలను పెడ చెవిన పెడుతోంది. యుద్ధాన్ని భీకరంగా కొనసాగిస్తోంది. ఈ పరిణామాల మధ్య ట్రంప్ మరోసారి ఇరాన్ కు అల్టిమేటం జారీ చేశారు.
 Article Image
ఇప్పటికే అనేక మార్లు అంతర్జాతీయ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిని ఇరాన్ తక్షణమే తెరవాలని ట్రంప్ మరోసారి అల్టిమేటం జారీ చేశారు. లేకపోతే 48 గంటల్లో పవర్ ప్లాంట్లు, బ్రిడ్జిలపై దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఇరాన్ పై బూతులతో రెచ్చిపోయారు ట్రంప్. హార్మూజ్ జలసంధిని తెరవండి బా**ర్డ్స్ అంటూ ఫైర్ అయ్యారు. లేదంటే నరకానికి పంపిస్తా.. చూస్తూ ఉండండి.. అల్లాను ప్రార్థించండి అంటూ ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమమైన ట్రూత్ సోషల్ లో పోస్టు చేశారు. ఇరాన్ మాత్రం ట్రంప్ మాటలను అస్సలు లెక్కచేయడం లేదు. దాడులను కొనసాగిస్తూనే ఉంది.

ఇదివరకే ట్రంప్ ఇరాన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. హార్మూజ్ జలసంధిని ఇరాన్ ఓపెన్ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ స్పష్టం చేశారు. ఒప్పందం చేసుకునేందుకు లేదా హార్మూజ్ ను తెరిచేందుకు 10 రోజుల గడువు ఇచ్చాను.. సమయం మించిపోతుంది.. వారిపై ప్రళయం విరుచుకుపడేందుకు ఇక కేవలం 48 గంటల సమయం మాత్రమే ఉంది.. అని ట్రూత్ సోషల్ ట్రంప్ పోస్టు చేశారు. ట్రంప్ మాటలను లెక్కచేయని ఇరాన్ అదే పనిగా సరిహద్దు అరబ్ దేశాల్లోని మౌలిక సదుపాయాలు, ఆర్థిక వనరులపై దాడులకు పాల్పడుతోంది. ఈ క్రమంలోనే ట్రంప్ ఇవాళ మరోసారి ఇరాన్ పై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. 

మరోవైపు అమెరికాకు చెందిన ఎఫ్-15 ఈ స్ట్రైక్‌ ఈగల్‌ యుద్ధ విమానం కూలిపోయిన ఘటనలో రెండో పైలట్‌ ను గుర్తించినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు తాజాగా వెల్లడించాయి. ఆ పైలట్ సురక్షితంగా ఉన్నాడని.. అమెరికా సైన్యం ఆధీనంలోనే ఉన్నట్లు పేర్కొన్నాయి. ఈ నెల 3న అమెరికాకు చెందిన యుద్ధ విమానాన్ని ఇరాన్‌ కూల్చివేసిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడిలో ఒక పైలట్‌ ను కాపాడగా.. రెండో పైలట్‌ కనిపించకపోవడంతో అమెరికా, ఇరాన్‌ అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఇక ప్రస్తుతం ఇద్దరు పైలట్లను ఇరాన్‌ భూభాగం నుంచి తీసుకొచ్చేందుకు అమెరికా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఒకరి అచుకీ లభ్యమైన రెండవ పైలెట్ విషయం క్లారిటీ లేదు.  

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!