Monday, 23 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

అప్పులు..అబద్దాలతో కూటమి పాలన ... రాష్ట్ర ఆదాయం తగ్గింది, ఖర్చులు పెరిగాయి... నేను చెప్పిన విషయాలనే కాగ్ రిపోర్టు చెప్పింది... వైసీపీ అధినేత వైఎస్ జగన్ ....

11 Mar 2026
01:31 PM
210

అప్పులు..అబద్దాలతో కూటమి పాలన ...
* రాష్ట్ర ఆదాయం తగ్గింది, ఖర్చులు పెరిగాయి...
* నేను చెప్పిన విషయాలనే కాగ్ రిపోర్టు చెప్పింది...
*వైసీపీ అధినేత వైఎస్ జగన్ ....

తాడేపల్లి       : 

చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి రాబడులు తగ్గాయని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా వేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు ఆర్థిక విధ్వంసంపై విమర్శలు గుప్పించారు. కూటమి ఆర్ధిక విధానాలతో రాష్ట్ర ఆదాయం తగ్గిపోయి అప్పులు పెరిగాయని, నేను చెప్పిన విషయాలనే కాగ్ రిపోర్టు చెప్పిందని విమర్శించారు. 

 

వైఎస్ జగన్ ప్రెస్ మీట్ ప్రధాన అంశాలు ... : 

 

* 2023-2024లో ప్రభుత్వం చేసిన ఖర్చు 2,36,486 కోట్లు

 2023-20246 రాబడులు 1,70,767

చంద్రబాబు వచ్చాక తొలి ఏడాది ఖర్చు రూ.2.49,506 కోట్లు

చంద్రబాబు వచ్చాక రాబడులు రూ.1,68,024 కోట్లు మాత్రమే

చంద్రబాబు హయాంలో రెవిన్యూ లోటు రూ.60,28153కోట్లు

రాష్ట్ర ఆదాయం తగ్గింది, ఖర్చులు పెరిగాయి.

* చంద్రబాబు వచ్చాక రెవిన్యూ లోటు 56 శాతం పెరిగింది.

చంద్రబాబు వచ్చాక రాబడులు తగ్గాయి

చంద్రబాబు వచ్చాక ద్రవ్య లోటు 30శాతం పెరిగింది.

వైసీపీ హాయంలో కోవిద్ ఉన్నా.. ఆదాయాలు తగ్గినా  హామీలు నెరవేర్చాం.

కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ మారింది

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు అమాంతం పెంచారు.

* రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత వరకు అప్పు తీసుకోవచ్చో కేంద్ర ప్రభుత్వం విధించే పరిమితి నెట్ బారో సీలింగ్ పరిధి దాటింది.

చంద్రబాబు అండ్ కో దోచిపెట్టడమే సరిపోతుంది.

మట్టిని, ఇసుక భూములు, లిక్కర్ దేన్ని వదలడం లేదు... అన్నింట్లో దోపిడీయే

ప్రభుత్వానికి ఆదాయానికి ఎలా వస్తుంది.

ప్రజలకు సంక్షేమం ఎలా అందుతుంది.

పిళ్ల దోపిడికి వైజాగ్లో జరిగిన భూదోపిడియే నిదర్శనం.

ఇలా చేస్తే ఆదాయాలు వస్తాయి.

చంద్రబాబు పాలనకు ఆయన బిల్డప్కు తేడా చూపించే మరో చరిత్ర

ఓవైపు మాపై తప్పుడు ప్రచారాలు చేస్తాడు.

ఇప్పుడు అప్పులు చేస్తారు... ఆ అప్పులు బయట పడకుండా దాచేసే ప్రయత్నం చేస్తారు.

కాగ్ రిపోర్టులో అప్పులు రూ.81,082.51 కోట్లు

కానీ అసెంబ్లీలో రూ.60,485.40 కోట్లు

సుమారు 20వేల కోట్లు వ్యత్యాసం ఉంది

16రోజుల అసెంబ్లీ సమావేశాలతో ప్రజలు ఒరిగింది సున్నా

చంద్రబాబు అధికారంలోకి రాగానే మళ్లీ సీన్ రివర్స్:

* 2024-25లోనే పరిమితికి మించి రూ.17,953కోట్లు అధికంగా అప్పులు తీసుకువచ్చారు.

ఇక 2025-26 ఏడాదిలో పరిస్థితి ఇంతకన్నా కూడా ఘెరంగా ఉంది.

ఈ రెండేళ్లలో చంద్రబాబు తెచ్చిన మొత్తం అప్పులు రూ.3.2లక్షల కోట్లు 

మా హయాంలో చేసిన అప్పుల్లో 96% అప్పులు ఈ రెండేళ్లలోనే చేశారు 

మా ఐదేళ్ల కాలంలో చేసిన అప్పులు కేవలం 3.31 లక్షల కోట్లు మాత్రమే 

ఎవరు జాగ్రత్తగా ఆర్థిక వ్యవస్థను నిర్వహించారు. ఎవరు ఆర్థిక వ్యవస్థను Damage చేశాడన్నది కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది 

రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడంలేదు.

విచ్చలవిడిగా జరుగుతున్న అవినీతి, దోపిడీ కారణంగా రాష్ట్రానికి ఆదాయాలు రావడంలేదు.

వనరులన్నింటినీ కూడా దోచేసి సొంత జేబులు నింపుకుంటున్నారు..

ఇసుక, మట్టి, సిబికా, క్వార్ట్స్, లెటరైట్, గ్రానైట్, లిక్కర్, భూములు, అధిక రేట్లకు పిపీపీలు చేన్నీ వదిలిపెట్టడంలేదు ..

* దోపిడీ జరిగితే, ప్రభుత్వానికి ఆదాయాలు ఎలా వస్తాయి? సంక్షేమం, అభివృద్ధి ఎలా నడుస్తుంది?

 విశాఖపట్నంలో అత్యంత విలువైన భూములను కారుచవరగా కట్టబెడుతూ దోపిడీకి పాల్పడుతున్నారు..

 రూ. 5వేల కోట్ల విలువ చేసి 54 ఎకరాల ప్రభుత్వ భూములను చంద్రబాబు బంధువు కబ్జాచేస్తున్నారు 

పాక్లెయిన్లతో లెవల్ చేసి, ప్రభుత్వం పెట్టిన బోర్డులను వీకేసి ఆక్రమించుకుంటున్నారు ..

ఇంత బహిరంగంగా ఒక ముఖ్యమంత్రి, ఆయన బంధువు, లోకసభ ఎంపీ కలిసి ప్రజల ఆస్తులను దోచేస్తున్నారు..

ప్రభుత్వంతోపాటు వ్యవస్థలన్నీ చోద్యం చూస్తున్నాయి...

ప్రజల ఆస్తులను రాబందుల్లా కొల్లగొడుతున్నారు.

ఆర్బీఐ ఆడ్వాన్స్లమీద ఆధారపడకుండా, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో, మినిమం బ్యాలెన్స్ నగదు నిల్వ ఉండే రోజులు

పడిపోయాయి...

ఏ కష్టాలు లేనప్పటికీ 2024-25లో నగదు నిల్వలున్న సమయం కేవలం 8 రోజులకు పడిపోయింది.

365 రోజుల్లో 357 రోజులు మినిమం బ్యాలెన్స్ కూడా ట్రెజరీల్లో లేవు.

చంద్రబాబు తాను చేస్తున్న పరిపాలనకు, ఆయన ఇస్తున్న బిల్డప్కు మధ్య తేడా కనిపిస్తోంది:

వైయస్సార్స్సి మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ మరోవైపు ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తున్నారు.

చేస్తున్న అప్పుల్ని బయటకు రానీయకుండా దాచేసే ప్రయత్నంచేస్తున్నారు.

2024-25లో చేసిన బడ్జెట్ అప్పులు రూ.50,485 కోట్లని వీళ్ల ప్రభుత్వం చెస్తోంది. కాని కాగ్ మాత్రం ఆ ఏడాదిలో చేసిన అప్పులు రూ.81,071 కోట్లని తేల్చిచెప్పింది.

దాదాపుగా రూ.20 వేల కోట్ల అప్పులను, వాస్తవంకంటే తక్కువ చేసి చూపించారు.

2024-25లో బడ్జెట్ వెలుపల చేసిన అప్పులపై వివరాలు ఇవ్వమని మండలిలో రాతపూర్వకంగా ప్రశ్నించాం:

అలాంటి అప్పులేవీ చేయలేదంటూ ప్రభుత్వం దాటవేసే ప్రయత్నం చేసింది:

రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అనేక సంస్థలు, ప్రభుత్వ గ్యారంటీతో, పెద్ద ఎత్తున అప్పులు తీసుకున్నాయి.

వీటన్నింటినీకూడా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అనక ఏమంటారు?

కాని వాటి లెక్కలను చెప్పడం లేదు

సభను తప్పుడన పట్టించన అధికారులపై దేవ నటికి ఫిర్యాదు చేస్తాం.

మొత్తం 16 రోజులపాటు జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చూస్తే... 

తప్పుడు లెక్కలు, తప్పుడు ప్రచారాలు, నల్ఫ్ డబ్బాలు తప్ప ప్రజలకు ఒరిగింది సున్నా...

చంద్రబాబు తన కొడుక్కి జాకీలు పెట్టి ఎత్తితే, చంద్రబాబుకి ఆయన కొడుకు జాకీలు పెట్టి ఎత్తుతాడు. వీళ్లిద్దరికీ పవన్ కళ్యాణ్ మరొక జాకీ పెట్టి లేపుతాడు.

అత్యస్తుతి... పరనింద

మూడు బడ్జెట్లు ప్రవేశ పెట్టారు.

సూపర్ సిక్స్ సూపర్ సెవన్లు లేవు.

నిరుద్యోగ భృతి అడుగుతుంటే సమాధానం లేదు

18ఏళ్లు నిండిన 60ఏళ్ల లోపు మహిళలకు ఆడబిడ్డ నిధికింద రూ. 1500 ఇస్తామని హామీ ఇచ్చారు.

* మీరు ఇచ్చిన హమీలపై అసెంబ్లీలో ప్రస్తావన లేదు

ప్రతి నిరుద్యోగికి రూ.1.08 లక్షల బకాయి పడ్డారు.

ఈ బడ్జెట్లో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల్ని ఎంతవరకు నెరవేర్చారు.

ఇదే విషయం గురించి చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా

50ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు నెలకు రూ.4వేలు

* పెన్షన్ ఇస్తామన్నారు. హామీ అమలు చేశావా?

మా హయాంలో 66,34,372 మందికి పెన్లను ఇచ్చాం

 2026 ఫిబ్రవరి నాటికి 60,96, 108 పెన్షన్లు మాత్రమే ఇచ్చారు.

2026 ఫిబ్రవరి నాటికి 60,96,108 పెన్షన్లు మాత్రమే ఇచ్చారు.

* 2026 మార్చి నాటికి 60,69,664 పెన్షన్లు మాత్రమే ఇచ్చాడు.

ఒక్క నెలలో 25వేల పెన్షన్లు కట్ చేశారు.

మా హయాంలో 66,34,372 మందికి పెన్షన్లు ఇచ్చాం

* పెన్షన్ల కోసం బడ్జెట్లో పెట్టాల్సింది రూ.31,554 కోట్లు

* బడ్జెట్లో పెట్టింది రూ.27,719కోట్లు మాత్రమే

భవిష్యత్లో ఇంకా పెన్షన్లు కట్ చేసే అవకాశం ఉంది.

పెన్షన్లపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సమాధానం లేదు.

udisc ప్రకారం 87.41,885 మందికి అమ్మ ఒడి ఇచ్చాం.

తల్లికి వందనం పేరుతో 2 0లక్షల మంది పిల్లలను తొలగించారు.

ఉచిత బస్సు హామీని పూర్తిగా నెరవేర్చలేకపోయారు.

ప్రతిమహిళకు 3 సిలిండర్లు ఇస్తామన్నారు.

ఒక సిలిండర్ ఇచ్చి రెండు సిలిండర్లు ఎగ్గొట్టారు

* అన్నదాత సుఖీభవ పేరుతో రైతులను మోసం చేశారు

రెండేళ్లలో ప్రతి రైతుకు రూ.40 వేలకు గాను 10వేరే ఇచ్చారు.

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!