Wednesday, 25 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

ఏపీలో ‘డ్రైవర్ కమ్ గైడ్’... పర్యాటక రంగంలో దేశంలోనే తొలి ప్రయోగం ... ఏపీలో పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు ...

06 Mar 2026
12:43 PM
20

అమరావతి  : 

         ఏపీలో పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టుబోతుంది. దేశంలోనే తొలిసారిగా ‘డ్రైవర్ కమ్ గైడ్’ అనే సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ప్రముఖ రవాణా సేవల సంస్థ ర్యాపిడోతో కలిసి ఏపీ పర్యాటక శాఖ ఈ పథకాన్ని అమలు చేయనుంది.ఈ ఒప్పందం ప్రకారం ర్యాపిడోకు చెందిన ఆటో, క్యాబ్ డ్రైవర్లే పర్యాటకులకు గైడ్లుగా కూడా వ్యవహరించనున్నారు.

Article Image

       ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా తొలి విడతగా విజయవాడలో ప్రారంభించనున్నారు. ఇందుకోసం ర్యాపిడో డ్రైవర్లలో అత్యుత్తమ ఫైవ్-స్టార్ రేటింగ్ ఉన్న 280 మందిని ఎంపిక చేశారు. వీరిలో 248 మంది ఆటో డ్రైవర్లు, 32 మంది క్యాబ్ డ్రైవర్లు ఉన్నారు. ఎంపిక చేసిన డ్రైవర్లకు పర్యాటక ప్రాంతాల చరిత్ర, సాంస్కృతిక ప్రాధాన్యత,విశిష్టతలు వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. పర్యాటకులతో మర్యాదపూర్వకంగా ఎలా మెలగాలి, వారి భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే విదేశీయులతో మాట్లాడేందుకు గూగుల్ ట్రాన్స్‌లేట్ వంటి యాప్‌లను ఎలా ఉపయోగించాలనే దానిపైనా అవగాహన కల్పిస్తున్నారు.

         ఈ పథకం కోసం ర్యాపిడో తన యాప్‌లో ప్రత్యేకంగా ‘టూరిస్ట్ గైడ్’ అనే ఆప్షన్‌ను అందుబాటులోకి తేనుంది. పర్యాటకులు యాప్ ఓపెన్ చేయగానే, సమీపంలోని ముఖ్యమైన పర్యాటక ప్రాంతాల జాబితా కనిపిస్తుంది. వారు కోరుకున్న ప్రాంతాన్ని ఎంచుకుంటే, శిక్షణ పొందిన డ్రైవర్ కమ్ గైడ్ వారిని తమ వాహనంలో అక్కడికి తీసుకెళ్లి, ఆ ప్రదేశం గురించి సమగ్రంగా వివరిస్తారు. విజయవాడ పరిసరాల్లోని భవానీ ద్వీపం, కొండపల్లి కోట, ఉండవల్లి గుహలు, అమరావతి స్థూపం, మంగినపూడి బీచ్ వంటి ప్రాంతాలకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.

       పర్యాటక ప్యాకేజీల ధరలను పర్యాటక శాఖ, ర్యాపిడో సంస్థలు సంయుక్తంగా నిర్ణయించి త్వరలోనే ప్రకటించనున్నాయి. విజయవాడలో పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైన తర్వాత విశాఖపట్నం, తిరుపతి వంటి ఇతర ప్రధాన నగరాలకు కూడా ఈ కార్యక్రమాన్ని విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ వినూత్న ప్రయత్నం ద్వారా పర్యాటకులకు మెరుగైన అనుభూతిని అందించడంతో పాటు డ్రైవర్లకు అదనపు ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు...

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!