Monday, 23 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / అంతర్జాతీయ వార్తలు

భారత్‌ యుద్ధానికి సిద్ధమవుతోంది.. ! సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసి హైడ్రో టెర్రరిజానికి పాల్పడుతొంది ... పాక్ అధ్యక్షుడు అలీ జర్దారీ సంచలన వ్యాఖ్యలు

03 Mar 2026
01:07 PM
12

pakistan :  

భారత్ పై పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్‌ అలీ జర్దారీ(Asif Ali Zardari) సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆపరేషన్ సిందూర్‌ సమయంలో భారత్‌ తమపై దాడులు చేస్తుంటే తనని బంకర్‌లో దాక్కోవాలని సలహా ఇచ్చారని చెప్పారు. ఇందుకు తాను ఒప్పకోలేదన్నారు. ప్రస్తుతం మిడిల్‌ ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపధ్యంలో భారత్‌ మరో యుద్ధానికి సిద్ధమవుతోందని ఆరోపణలు చేశారు. పాక్ పార్లమెంటరీ సంయుక్త సమావేశంలో ఆయన ప్రసంగించారు.  

ఈ సందర్భంగా జర్దారీ మాట్లాడుతూ  కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌.. సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసి హైడ్రో టెర్రరిజానికి పాల్పడిందని తన నోటీ దూలను చాటుకున్నారు. రాజకీయానికి నీటి ప్రవాహాలను ముడిపెట్టి ఆయుధంగా వాడటం సమంజసం కాదని , అందుకే భారత్ మరో యుద్ధానికి రెడీ అవుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు. తాము మాత్రం శాంతి, సంభాషణల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని చూస్తున్నామని, ఇరుదేశాల మధ్య ఇంకా ఉద్రిక్త పరిస్థితులు తగ్గలేదని.. భారత్‌తో చర్చలు జరిపేందుకు పాక్ రెడీగా ఉన్నట్లు చెప్పారు.  

అయితే మిడిల్‌ ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపధ్యంలో పాక్ ప్రధాని జర్దారీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఇటీవల పహల్గాం ఉగ్రదాడి ఘటనలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత భారత్‌ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్‌, పీవోకేలోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. మరోవైపు సింధూ జలాల ఒప్పందాన్ని నిలివేసింది. సరిహద్దును సైతం మూసివేసింది. ఇరుదేశాలు కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ సరిహద్దు ప్రాంతాల్లో ఇప్పటికీ అక్కడక్కడ దాడులు జరుగుతున్నాయి.

మరో వైపు ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో మరణించిన అనంతరం పనలు దేశాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటుండగా.... పాక్‌లో అమెరికన్‌ ఎంబసీపై అక్కడి స్థానికులు దాడులు చేశారు. అమెరికా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేశారు. మరోవైపు భారత్‌లో కూడా జమ్మూకశ్మీర్‌, హైదరాబాద్‌లో కూడా షియా ముస్లింలు ఆందోళనలు చేపట్టడం కలకలం రేపింది. అయితే ఉన్న ఫలంగా పాక్ అధ్యక్షుడు  సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్ తమపై హైడ్రో టెర్రరిజానికి పాల్పడుతుందని ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది.  

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!