Wednesday, 25 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

పదవులకు మాత్రమే దూరం ... పార్టీకి కాదు .... జనసైనికుడిగా ఉద్యమం చేస్తున్నా ... జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ క్లారిటీ..

07 Feb 2026
09:48 PM
38


పదవులకు మాత్రమే దూరం ... పార్టీకి కాదు ....
జనసైనికుడిగా ఉద్యమం చేస్తున్నా ...
జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ క్లారిటీ..  
పర్యావరణానికి సంబంధించి వైసీపీ ప్రభుత్వ హయాంలో తాను కేసు వేశా ..
కేసు ఇప్పటికీ కొనసాగుతున్న నేపథ్యంలో పదవిలో ఉండటం సముచితం కాదని తప్పుకున్నా...
₹1,00,000 కోట్ల పర్యావరణ నష్టానికి కారణమైన వారిని శిక్షించేందుకు స్వతంత్ర విచారణ జరిపించాలి...

విశాఖ  : 

జనసేన పార్టీకి పార్టీ సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ రాజీనామా అంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. కేవలం పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి మాత్రమే తాను రాజీనామా చేశానని.. జనసేన పార్టీకీ కాదంటూ బొలిశెట్టి  క్లారిటీ ఇచ్చారు. ఈ విషయాన్ని లేఖలోనూ ప్రస్తావించానని.. అయితే కొంతమంది స్వార్థంతో దీనిని తప్పుగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. తాను ఎల్లప్పుడూ పవన్ కళ్యాణ్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు.

నసేన పార్టీకి రాజీనామా అంటూ జరుగుతున్న ప్రచారంపై బొలిశెట్టి సత్యనారాయణ స్పందించారు. తాను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి మాత్రమే రాజీనామా చేశానని.. పార్టీకి కాదంటూ బొలిశెట్టి సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు. జనసైనికుడిగా ఉద్యమం చేస్తున్నానని.. తాను వేసిన కేసు విచారణ పూర్తైన తర్వాత పవన్ కళ్యాణ్ ఏ బాధ్యతలు అప్పగించినా స్వీకరిస్తానని ప్రకటించారు. మరోవైపు జనసేనకు షాక్.. కీలక నేత రాజీనామా అంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే బొలిశెట్టి సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు. పర్యావరణానికి సంబంధించి వైసీపీ ప్రభుత్వ హయాంలో తాను కేసు వేశానని.. ఆ కేసు ఇప్పటికీ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేనలో కీలక పదవిలో ఉండటం సముచితం కాదని పార్టీ పదవి నుంచి తప్పుకున్నట్లు బొలిశెట్టి వివరించారు.  పర్యావరణంపై కేసు వేశాను. అది కోర్డు పరిధిలో ఉంది. నేను కేసు వేసినప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. వేరే వాళ్లు పర్యావరణ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ భాగస్వామిగా ఉంది. ఓ వైపు నేను జనసేన ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న సమయంలోనే.. మరోవైపు కూటమి ప్రభుత్వం మీద కేసు కొనసాగుతుంది. పార్టీలు మారినా ప్రభుత్వాలు కొనసాగుతాయి కావున ఆ కేసు అలాగే కొనసాగుతుంది.

ఈ నేపథ్యంలో నేను జనసేన పార్టీ పర్యావరణ ప్రధాన కార్యదర్శిగా ఉండటం సరికాదని.. ఆ పదవికి రాజీనామా చేశా. జనసైనికుడిగా కొనసాగుతున్నా. పార్టీకి రాజీనామా చేయలేదు.. పదవికి మాత్రమే రాజీనామా చేశా. నేను రాసిన లెటర్‌లో కూడా ఈ విషయం ఉంది. ఈ కేసు పూర్తైన తర్వాత జనసేన పార్టీలో పవన్ కళ్యా్ణ్ ఏ బాధ్యతలు అప్పగించినా పనిచేస్తా్నని అందులో ఉంది. కానీ ఎవరిష్టం వచ్చినట్లు వారు ప్రచారం చేస్తున్నారు. అందుకే క్లారిటీ ఇస్తున్నా.." బొలిశెట్టి సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు. మరోవైపు ఇదే విషయంపై బొలిశెట్టి సత్యనారాయణ ట్వీట్ కూడా చేశారు. జనసేనాని వెంటే జనసైన్యం ఉంటుందన్న బొలిశెట్టి.. రాజకీయ యవనికపై జనసేన కేవలం పార్టీ కాదని.. సామాజిక విప్లవంగా అభివర్ణించారు. జనసేన పార్టీ ఎన్నికల కోసం పుట్టింది కాదని.. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని.. మన సనాతన ధర్మం గొప్పతనాన్ని జతపరచి రూపొందించిన ఏడు మూల సిద్ధాంతాలపై ఆధారంగా నిర్మించిన వ్యవస్థగా చెప్పారు. ఏ పార్టీలో అయినా కార్యకర్తలకు పార్టీ నుంచి ఆర్థిక సాయం వస్తుందని.. జనసైనికులు మాత్రం తమ సొంత డబ్బుతో జనసేన జెండాను మోస్తున్నారని అన్నారు. జనసేనతో తన బంధం రాజకీయాలకు అతీతమైనదని.. ఒక సిద్ధాంతం కోసం తాను కేవలం పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి మాత్రమే రాజీనామా చేశానని బొలిశెట్టి ట్వీట్ చేశారు.  

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!