రైల్వేకోడూరు :
తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీ అరవ శ్రీధర్ పై ప్రసార మాధ్యమాలలో వచ్చిన వార్తలు, ఒక మహిళ చేసిన ఆరోపణలపై విచారణ చేయాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది. ఈ అంశంపై టి.శివశంకర్, తంబళ్ళపల్లి రమాదేవి, టి.సి.వరుణ్ లతో ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించింది. కమిటీ సదరు ఆరోపణలపై నిజానిజాలు విచారణ చేసి పార్టీకి నివేదిక అందిస్తుంది. ఈ మేరకు ఈ రోజు రైల్వేకోడూరులో ఏర్పాటు చేసిన విచారణ ముందుకు ఎమ్మెల్యే అరవ శ్రీథర్ హజరయ్యారు. ఈ సందర్బంగా కమిటి ముందు తన వద్ద ఉన్న సమాచారాన్ని చెప్పేందుకు అయన ముందుకు వచ్చారు. అయితే ఈ విచారణ సందర్బంగా కమిటి ఎలాంటి ప్రశ్నలు అడగనుంది ? ఎమ్మెల్యే అరవ శ్రీథర్ ఎలాంటి సమాచారాన్ని, సాక్ష్యాలను కమిటికి సమర్పించనున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ విచారణ సంబంధర్బంగా విచారణ జరుగుతున్న హోటల్ వద్దకు పెద్ద ఎత్తున జనసేప కార్యకర్తలు చేరుకున్నారు. పోలీసులు సైతం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.